Disha Telugu Newspaper

Disha Telugu Newspaper

Dishadaily offers you up-to-date Telugu news, along with e-papers and videos. It provides comprehensive coverage of news from Andhra Pradesh and Telangana.

Local
Telugu
Online/Digital

Outlet metrics

Domain Authority
23
Ranking

Global

#5504

India

#436

News and Media

#59

Traffic sources
Monthly visitors

Articles

  • 1 month ago | dishadaily.com | Ajay Kumar

    దిశ‌, వెబ్ డెస్క్: వైసీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని కూటమి నేతల కనుసన్నల్లో కొందరు అధికారులు పనిచేస్తున్నారని మాజీ సీఎం జగన్ అన్నారు. వారికి రిటర్న్ గిఫ్ట్ తప్పకుండా ఇస్తామని వార్నింగ్ ఇచ్చారు. స్థానిక సంస్థల ప్రతినిధుల భేటీలో జగన్ మాట్లాడారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని అన్నారు. తప్పుడు కేసులతో పాటూ దొంగ సాక్ష్యాలు సృష్టిస్తున్నార‌ని మండిప‌డ్డారు. ప‌ల్నాడులో టీడీపీలోని రెండు వర్గాల మ‌ధ్య ఆధిప‌త్యపోరులో హ‌త్య‌లు జ‌రిగాయని చెప్పారు.

  • 1 month ago | dishadaily.com | Ajay Kumar

    దిశ‌, వెబ్ డెస్క్: తిరుమల ఘాట్ రోడ్డులో భక్తులకు మరోసారి చిరుతపులి కనిపించింది. మొదటి ఘాట్ రోడ్డులో వినాయక స్వామి ఆలయం వద్ద ప్రహరీ గోడపై చిరుత పరిగెత్తడాన్ని కారులో వెళుతున్న భక్తులు వీడియో తీశారు. రెండు కార్లు రోడ్డుపై వెళుతుండగా చిరుత ప్రహరీ గోడపై పరిగెత్తుతూ ఒకచోట పక్కకు దూకేసింది. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది, అయితే తిరుమ‌ల ఘాట్ రోడ్డులో అడ‌వి జంతువులు క‌నిపించ‌డం ఇదే మొద‌టిసారి కాదు. అనేక‌సార్లు జంతువులు ఈ దారి గుండా వెలుతూ భ‌క్తుల‌కు క‌నిపించాయి.

  • 1 month ago | dishadaily.com | Ajay Kumar

    దిశ, వెబ్ డెస్క్: ఫార్ములా రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటీఆర్‌కు నోటీసులు జారీ చేయడాన్ని ఖండిస్తున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు స్పష్టమవుతోందన్నారు. తమ పార్టీ నాయకులకు వరుస నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు తేటతెల్లమైందన్నారు.

  • 1 month ago | dishadaily.com | Ajay Kumar

    దిశ‌, వెబ్ డెస్క్: ఛత్తీస్‌గఢ్‌ ఎన్కౌంటర్‌లో చనిపోయిన 28 మంది మావోయిస్టుల మృత‌దేహాల‌కు అంత్య‌క్రియ‌లు పూర్తి చేశారు. పోలీసులు సామూహిక అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. నంబాల కేశ‌వ‌రావుతో పాటూ మొత్తం 27 మంది అంత్యక్రియ‌లు పూర్తి చేసినట్టు సమాచారం. ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్‌లో మొత్తం 28 మంది మావోయిస్టులు మరణించారు. అయితే వీరి మృత‌దేహాల కోసం కుటుంబ స‌భ్యులు ఎంత‌గానో ఎదురుచూశారు. త‌మ వారిని క‌డ‌సారి చూసుకోవాల‌ని అనుకున్నారు.

  • 1 month ago | dishadaily.com | Ajay Kumar

    దిశ, తెలంగాణ బ్యూరో: రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం ఎలా అమలు చేయాలో తెలుసుకొని, కేంద్రం తలపెట్టిన వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ ఈనెల 29 నుంచి 2 జూన్ వరకు జరిగే కార్యక్రమంలో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పాల్గొనాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సూచించారు. సోమవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో అవసరమున్న రైతుకు మట్టి నమూనా పరీక్ష చేసుకొనే వెసులుబాటు కల్పించాలని డైరెక్టర్ గోపికి ఆదేశాలు ఇచ్చారు.