Andhra Prabha

Andhra Prabha

Andhra Prabha is a daily newspaper that publishes content in the Telugu language in India. Its website, www.prabhanews.com, is currently part of the New Indian Express Group of Companies. However, the newspaper itself was sold to business owners from Kakinada.

Local
Telugu
Newspaper

Outlet metrics

Domain Authority
30
Ranking

Global

#109133

India

#7617

News and Media

#287

Traffic sources
Monthly visitors

Articles

  • 2 days ago | prabhanews.com | Gopi Krishna

    వైఎస్ఆర్ కడప జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. వేసవి సెలవుల వేళ సరదాగా ఈత కొట్టడానికి వెళ్లిన ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ సంఘటనతో బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లి గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. పిల్లల ఆచూకీ కోసం అధికారులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. మల్లేపల్లి గ్రామానికి చెందిన ఐదుగురు విద్యార్థులు వేసవి సెలవులు కావడంతో మంగళవారం నాడు సమీపంలోని చెరువుకు ఈత కొట్టేందుకు వెళ్లారు. సాయంత్రం ఎంతసేపటికీ పిల్లలు ఇళ్లకు తిరిగి రాకపోవడంతో వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.

  • 2 days ago | prabhanews.com | Gopi Krishna

    హైదరాబాద్ – బీఆర్ఎస్‌లో అంతర్గత విభేదాలున్నాయంటూ వస్తున్న ఊహాగానాలకు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తెరదించారు. పార్టీలో ఎలాంటి వర్గ పోరు లేదని స్పష్టం చేస్తూనే, కేటీఆర్ కు పార్టీ బాధ్యతలు అప్పగించడంపై కీలక వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నేడు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీలో తనకు, కేటీఆర్‌కు మధ్య విభేదాలున్నాయన్న ప్రచారాన్ని హరీశ్ రావు కొట్టిపారేశారు. ఒకవేళ కేటీఆర్‌కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే తాను తప్పకుండా స్వాగతిస్తానని ఆయన స్పష్టం చేశారు.

  • 2 days ago | prabhanews.com | Gopi Krishna

    హైద‌రాబాద్ – ఒకవైపు దేశం కోసం మనవాళ్లు యుద్ధం చేస్తుంటే.. మరోవైపు రైతులు తమ పంట అమ్ముకోవడానికి మరో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. ధాన్యం రాశులను గాలికి వదిలేసి అందాల రాసుల చుట్టూ సీఎం తిరుగుతున్నారు అని ఎద్దేవా చేశారు. రైతుల దగ్గర పంటను కొనడం లేదు.. 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరగకుండా జాప్యం చేస్తున్నారు.. రైతులకు 4 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయి పడింది.. రైతు పెట్టుబడి సాయం అందించడంలో కూడా జాప్యం కొనసాగుతుందని హరీశ్ రావు అన్నారు.

  • 2 days ago | prabhanews.com | Gopi Krishna

    విజయవాడ – గన్నవరం వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరైంది.. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టైన వల్లభనేని వంశీ బెయిల్ కోసం ఎస్సీ ఎస్టీ కోర్టులో బెయిల్ కోసం పిటిష‌న్ దాఖ‌లు చేశారు.. విచారించిన కోర్టు ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 2024 ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ కార్యాలయంపై అప్పడు గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ అనుచరులు, వైసీపీ నాయకులు దాడి చేసి నిప్పుబెట్టారు.

  • 2 days ago | prabhanews.com | Gopi Krishna

    ఉగ్ర‌వాదుల‌కు పాక్ అండ‌…గ్లోబల్ టెర్రరిస్ట్ మసూద్ అజార్‌కు భారీ నజరానా.. రూ. 14 కోట్లు ప్రకటించిన దుష్ట పాకిస్థాన్ సర్కార్!ఇస్లామాబాద్ – ఉగ్రవాదుల బడాడాన్‌కి మరచిపోలేని గుణపాఠం చెప్పింది మన ఆపరేషన్‌ సింధూర్‌. ఉగ్రసౌధం కళ్లముందే పేకమేడలా కూలిపోయింది. తట్టుకోలేక ఘొల్లుమని ఏడ్చాడు. అంతలోనే బాధా లేదు భయమూ లేదంటూ విర్రవీగాడు. ఫ్యామిలీ అంతా నేలకొరిగినా ఆ ఉగ్రముష్కరుడు మాత్రం వాగుతూనే ఉన్నాడు. ఉగ్రశిబిరాలు నేలమట్టమైనా విర్రవీగుతూనే ఉన్నాడు. అలాంటి ఉగ్రముష్కరుడికి దుష్ట పాకిస్థాన్ ప్రత్యేక నజరానా ప్రకటించింది.

Andhra Prabha journalists